కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాది వయసున్న పునర్విక అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనే వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటే ఏకైక మార్గం రూ.16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్. తల్లిదండ్రులు దాతల సాయం కోరడంతో రూ.10కోట్లు సమకూరాయి. ఆ సమయంలో విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ మిగిలిన 6కోట్ల సంగతి తనకు వదిలేయమన్నారు. ఆ క్షణం నుంచి అన్నివిధాలా ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అమెరికా నుంచి ఖరీదైన ఇంజెక్షన్ ను త్వరితగతిన హైదరాబాద్కు రప్పించే పనిని తన సిబ్బంది ద్వారా నిరంతరం లోకేష్ గారు పర్యవేక్షించారు. ఈరోజు దగ్గరుండి మరీ పాపకు ఇంజక్షన్ ఇప్పించారు. పునర్విక చికిత్సలో ఎలాంటి ఆలస్యం జరగకుండా మంత్రి లోకేష్ చేసిన కృషితో నిండు ప్రాణాలు నిలిచాయి. లోకేష్ చేసిన సాయాన్ని జీవింతాంతం గుర్తుపెట్టుకుంటామని పునర్విక తల్లిదండ్రులు భావోద్వేగంతో చెప్పారు.
#Punarvika
#NaraLokesh
1 475
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram