అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ (SMA TYPE-1) వ్యాధితో బాధపడుతున్న పునర్విక అనే చిన్నారి వైద్యానికి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ అందించిన భారీ ఆర్ధిక సాయంపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్నారి పునర్విక సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి ఉండాలంటే విదేశాల నుంచి రూ.16 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ తెప్పించి ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు. అందుకోసం ఎంతో మంది దాతలు ఆర్ధిక సాయం అందించారు. అది రూ.10 కోట్ల వరకూ వచ్చింది. విషయం తెలుసుకున్న శ్రీ నారా లోకేష్ అవసరమైన మరో రూ.6 కోట్లు తానే అందిస్తానని పునర్విక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దాంతో జోల్ జెన్ స్మా అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ ను అమెరికా నుంచి వైద్యుల పర్యవేక్షణలో తెప్పించి హైదరాబాద్ లోని రెయిన్ బో పిల్లల ఆసుపత్రిలో చిన్నారి పునర్వికకు ఇచ్చారు. ఆ సందర్భంలో శ్రీ నారా లోకేష్ కూడా ఆసుపత్రిలో పునర్విక తల్లిదండ్రులకు సాయంగా ఉన్నారు. ధైర్యం చెప్పారు. చికిత్స అనంతరం చిన్నారి పునర్వికను కొద్ది సేపు ఎత్తుకుని లాలించారు. ఈ అంశాన్ని మంత్రి శ్రీ నారా లోకేష్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ‘చిన్నారి పునర్విక క్షేమంగా ఉంది’ అనే సందేశాన్ని పోస్టు చేశారు. చిన్నారి పునర్వికకు ఆయన చేసిన సాయంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కొందరు దీన్ని భరించలేక తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చిన డబ్బులతో మంత్రి శ్రీ లోకేష్ తన స్వీయ ప్రచారం చేసుకుంటున్నారనే తప్పుడు వార్తను పోస్టు చేశారు. సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) నుంచి గానీ, మరేఇతర ప్రభుత్వ శాఖ నుంచి గానీ మంత్రి శ్రీ నారా లోకేష్ ఈ నిధులను సేకరించలేదు. కేవలం తన సొంత వనరుల నుంచి మాత్రమే రూ.6 కోట్లు సమీకరించారు. సాయం చేసిన వారిని విమర్శించేందుకు సాకులు వెతకడం వారి సంస్కారాన్ని తెలుపుతున్నది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు.
32
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram